జనసేనకే గాజు గ్లాసు
ABN , Publish Date - Apr 29 , 2024 | 04:07 AM
గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు. దీనిపై జనసేన గత వారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈసీ సూచనల మేరకు గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మెమో జారీ చేశారు.