Share News

జనసేనకే గాజు గ్లాసు

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:07 AM

గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు.

జనసేనకే గాజు గ్లాసు

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు. దీనిపై జనసేన గత వారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈసీ సూచనల మేరకు గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా మెమో జారీ చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 04:07 AM