విశాఖకు తొలి అంతర్జాతీయ క్రూయిజ్
ABN , Publish Date - Apr 29 , 2024 | 04:22 AM
విశాఖపట్నంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్కు ఆదివారం మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వచ్చింది.
విశాఖపట్నం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్కు ఆదివారం మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వచ్చింది. లగ్జరీ విభాగానికి చెందిన ‘ది వరల్డ్’ విశాఖ టెర్మినల్లో బెర్తింగ్ అయింది. నౌకలో వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. విశాఖ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. దేశంలోని ఇతర పోర్టులతో పోలిస్తే ఇమిగ్రేషన్ ప్రక్రియను విశాఖపట్నం పోర్టు అధికారులు వేగంగా 45 నిమిషాల్లోనే పూర్తి చేయడంపై షిప్ కెప్టెన్ సంతృప్తి వ్యక్తం చేశారు. నౌకలోని ప్రయాణికులంతా యజమానులుగా చెబుతున్నారు.