కూటమి విజయం ప్రజా విజయం
ABN , Publish Date - Apr 29 , 2024 | 04:11 AM
కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు.
విశాఖను దోచుకునేందుకే రాజధాని నాటకం: వంగవీటి
అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా), ఏప్రిల్ 28: కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం జనసేన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ... ‘జగన్రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కుడు కార్యక్రమంతోపాటు తన స్వలాభం కోసం చాలా నొక్కాడు. జగన్రెడ్డి ఐదేళ ్ల పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదు. విశాఖలో అన్ని వనరులు ఉన్నాయి. అక్కడ పాగా వేసి సర్వం దోచుకోవాలన్న దురాలోచనతో జగన్రెడ్డి పరిపాలనా రాజధాని చేస్తానన్నాడు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.