Share News

tdp: సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్నివర్గాలకు మేలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:33 AM

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌28: చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ ఎంపీపీ కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఆదివారం వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి పథకాలపై ప్రచారం నిర్వహించారు.

tdp: సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్నివర్గాలకు మేలు

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌28: చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ ఎంపీపీ కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఆదివారం వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి పథకాలపై ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాల వల్ల కుటుంబంలో ఎవరెవరికి ఎంతమేరకు లబ్ధి చేకూరుతుందో వివరించారు. చంద్రబాబు సీఎం అవగానే వెంటనే ఈ పథకాలను అమలు చేస్తారని తెలిపారు. కనుక ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలఇనచార్జి అశోక్‌రెడ్డి, నాయకులు రాఘవరెడ్డి, పార్థారెడ్డి, గణే్‌షరెడ్డి, విజయ్‌చౌదరి, పాళ్యం వెంకటేష్‌, చండ్రాయుడు, ఆనంద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 29 , 2024 | 12:33 AM