Share News

bjp:గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:30 AM

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌28: తాను అధికారంలోకి రాగానే వార్డులు, గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని గిర్రాజుకాలనీ, సత్యసాయినగర్‌, దు ర్గానగర్‌, 33, 34, 35 వార్డులు, మారుతీనగర్‌, రాజేంద్రనగర్‌, లక్ష్మీనగర్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.

bjp:గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా

  • ఎన్నికల ప్రచారంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌28: తాను అధికారంలోకి రాగానే వార్డులు, గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని గిర్రాజుకాలనీ, సత్యసాయినగర్‌, దు ర్గానగర్‌, 33, 34, 35 వార్డులు, మారుతీనగర్‌, రాజేంద్రనగర్‌, లక్ష్మీనగర్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.


ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, సైకిల్‌ గుర్తుకు ఓటేసి బీకే పార్థసారధిని ఎంపీగా గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యే కాగానే గ్రామాల్లో, వార్డుల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారని వివరించారు. కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 29 , 2024 | 12:30 AM