tdp: భూదందాల ఎమ్మెల్యేని ఓడిద్దాం
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:28 AM
నల్లమాడ, ఏప్రిల్ 28: భూ దందాలు చేసి పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఓడిద్దామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాతబత్తలపల్లి పంచాయతీ పాతబత్తలపల్లి, చండ్రాయునిపల్లి, నల్లగొండ, యనుములవారిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి గ్రామాల్లో ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
నల్లమాడ, ఏప్రిల్ 28: భూ దందాలు చేసి పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఓడిద్దామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాతబత్తలపల్లి పంచాయతీ పాతబత్తలపల్లి, చండ్రాయునిపల్లి, నల్లగొండ, యనుములవారిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి గ్రామాల్లో ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
తర్వాత ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా సింధూరను, ఎంపీగా బీకే పార్థసారధని గెలిపించాలని కోరారు. పల్లె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నిత్యం భూదందాలకు పాల్పడుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆయన ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మైలే శివ శంకర్, నాయకులు గడ్డం రమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బుట్టి నాగభూషణనాయుడు, కులశేఖర్నాయుడు, ప్రసాద్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....