Share News

tdp: టీడీపీలోకి చేరికలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:32 AM

కొత్తచెరువు, ఏప్రిల్‌ 29: పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మండలంలోని తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

tdp: టీడీపీలోకి  చేరికలు

కొత్తచెరువు, ఏప్రిల్‌ 29: పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మండలంలోని తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


వారికి సింధూరారెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిన వైసీపీని ఇంటికి సాగనంపుదామని అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ సైనికుల్లా కష్టపడాలని సూచించారు. టీడీపీలోకి చేరిన వారిలో మాదినేని వెంకటనారాయణ, ఇరగంపల్లి ఉపసర్పంచ శ్రీరాములు, వలంటీర్‌ ప్రణిత, మాజీ సర్పంచ నిర్మల, శ్రీధర్‌, కిరణ్‌, శ్రీనివాసులు, జయరాంనాయుడు, వెంకటరాముడు, శీన, వెంక టాచలం, గోపాల్‌నాయక్‌, హరీశ, మధుసూదన, తిప్పానాయక్‌, శ్రీనాథ్‌, నాగరత్నమ్మ, రామచంద్ర, జానకమ్మ, బాలక్రిష్ణ, మహేశ; శారద, జయరాం నాయక్‌, వెంకటేశ్వర్లు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 30 , 2024 | 12:32 AM