Home » Telangana » Khammam
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మార్కెంటింగ్,జౌలి, ఆహార శుద్ధి ఏర్పాట్లు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
పచ్చిమిర్చి ధరలు మండు తున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.50-రూ.60 పలికిన ధర ఇటీవల భారీగా పెరిగింది.
జిల్లా కేంద్రంలో(Khammam Centre) దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ(RMP) నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే.. ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి..
ఖమ్మం లోక్సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.
Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..