Home » Chandra Babu
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
ఈ-ఆఫీసు వెర్షన్ అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనుమానాలున్నాయని, ఈ వ్యవహారాన్ని తక్షణం నిలిపేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని టీడీపీ
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
Andhrapradesh: ప్రతీ ఏటా పండుగలా జరిగే మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల పలితాలే కారణం. ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణం కోసం విదేశాల్లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కలిక విరామం ప్రకటించి స్వదేశానికి వచ్చి తెలుగుదేశం కూటమి కోసం ఇటివల ఏపీ ఎన్నికల ప్రచారానికి(ap elections 2024) వచ్చిన ప్రవాసీయులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యన్. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు.
మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్ ముగిసీ ముగియగానే..
MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.