Home » aam aadmi party
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్ 7-8 సార్లు తనను చెంపపై బలంగా కొట్టాడని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఆరోపించారు. అకారణంగా తనపై దాడి చేశారని తెలిపారు. ‘
ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారని చెబుతూ ఆమ్ ఆద్మీ(AAP) పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. శ్రీ రామ నవమి సందర్భంగా తమ పాలన రామరాజ్యంతో సమానమే భావనను కలిగించడానికి ఆప్ బుధవారం ఓ వెబ్సైట్ని ప్రారంభించింది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 సీట్ల నినాదం సాధ్యం కాదని అన్నారు. ఈసారి 400 సీట్ల మార్క్ దాటేందుకు ప్రధాని మోదీ అంపైర్లను ఎంచుకున్నారని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ బీజేపీ రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను పరిశీలించి, ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.