Share News

తనిఖీల్లో రూ.16.84 లక్షల నగదు స్వాధీనం

ABN , Publish Date - May 05 , 2024 | 05:22 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఎలాంటి

తనిఖీల్లో రూ.16.84 లక్షల నగదు స్వాధీనం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న డబ్బు, మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా రూ.10,31,190 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మునిసిపల్‌ పరిధిలో వాహనాల తనిఖీ సందర్భంగా ఓ కారులో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంఽధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గాదె వాగువద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.1.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకువస్తున్న భువనగిరికి చెందిన వ్యక్తి నుంచి రూ.93 వేలు, కొత్తగూడ మండలం దుర్గారంకు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 05 , 2024 | 08:10 AM