Share News

రైతులకు రాజన్న కోడెలు!

ABN , Publish Date - May 05 , 2024 | 04:51 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకునే కోడెలను రైతులకు, గుర్తింపు పొందిన గోశాలలకు అందించేందుకు ఆలయ

రైతులకు రాజన్న కోడెలు!

దేవాదాయ కమిషనర్‌కు నివేదిక..

ఉత్తర్వులు రాగానే ఉచిత పంపిణీ: ఈవో

వేములవాడ టౌన్‌, మే 4: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకునే కోడెలను రైతులకు, గుర్తింపు పొందిన గోశాలలకు అందించేందుకు ఆలయ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పశుసంవర్థకశాఖ, ఆలయాధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి కోడెలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావుకు ఇప్పటికే నివేదిక అందజేసినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. ‘రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. క్లియరెన్స్‌ రాగానే నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి అగ్రిమెంట్‌ తీసుకొని కోడెలను అందించాలని అనుకుంటున్నాం. ఉత్తర్వులు రాగానే ఉచితంగా రైతులకు కోడెలను అందజేస్తాం. త్వరలోనే పంపిణీ ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.

Updated Date - May 05 , 2024 | 04:51 AM