దిగొచ్చిన గోదావరి బోర్డు
ABN , Publish Date - May 05 , 2024 | 05:21 AM
ఆఫీస్ మాన్యువల్ విషయంలో ఎట్టకేలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) దిగొచ్చింది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మాన్యువల్నే పాటిస్తామని చెబుతూ వచ్చిన బోర్డు, తెలుగు
ఆఫీసు మాన్యువల్ సిద్ధం చేయడానికి కమిటీ
హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): ఆఫీస్ మాన్యువల్ విషయంలో ఎట్టకేలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) దిగొచ్చింది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మాన్యువల్నే పాటిస్తామని చెబుతూ వచ్చిన బోర్డు, తెలుగు రాష్ట్రాలు నిలదీయడంతో ప్రత్యేకంగా ఆఫీస్ మాన్యువల్ను తయారుచేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీనికోసం బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లతో కమిటీ వేసింది. రెండు మూడు నెలల్లోపు బోర్డు ప్రత్యేకంగా నియామావళిని సిద్ధం చేసుకోనుంది.