వందవ రోజుకు చేరిన నిత్య జాతీయ గీతాలాపన
ABN , Publish Date - May 04 , 2024 | 11:03 PM
బెల్లంపల్లి పట్టణంలో జనహిత సేవా సమితి ఆధ్వ ర్యంలో పోలీసు శాఖ సహకారంతో నిత్య జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమం శనివారం వందవ రోజుకు చేరుకుంది.
బెల్లంపల్లి, మే 4: బెల్లంపల్లి పట్టణంలో జనహిత సేవా సమితి ఆధ్వ ర్యంలో పోలీసు శాఖ సహకారంతో నిత్య జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమం శనివారం వందవ రోజుకు చేరుకుంది. సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ జాతీయ గీతాన్ని గౌరవిం చాలని జనవరి 26న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్వెంకటస్వామి చేతుల మీదుగా జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రోజు ఉదయం 8 గంటలకు జాతీయ గీతాలాపన జరుగుతుందని, దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.