Share News

43 పతకాలతో భారత్‌ రికార్డు

ABN , Publish Date - May 05 , 2024 | 03:16 AM

ఆసియా అండర్‌-22, యూత్‌ చాంపియన్‌షిప్‌లో శనివారంనాటి పోటీల్లో మరో నలుగురు బాక్సర్లు తమ విభాగాల్లో ఫైనల్స్‌కు చేరడంతో..

43 పతకాలతో భారత్‌ రికార్డు

ఆసియా యూత్‌ బాక్సింగ్‌

ఆస్థానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ చాంపియన్‌షిప్‌లో శనివారంనాటి పోటీల్లో మరో నలుగురు బాక్సర్లు తమ విభాగాల్లో ఫైనల్స్‌కు చేరడంతో..ఈసారి టోర్నీలో భారత్‌కు రికార్డు స్థాయిలో మొత్తం 43 పతకాలు ఖాయమయ్యాయి. ఆకాశ్‌ (60 కిలోలు), విశ్వంత్‌ (48 కి.), నిఖిల్‌ (57 కి.), ప్రీత్‌ (67 కి.) ఫైనల్స్‌ చేరారు. యూత్‌ మహిళల విభాగంలో నిషా (52 కి.), నికితా (60 కి.)తో పాటు మరో ఐదుగురు ఫైనల్లో అడుగుపెట్టారు. మరో ఐదుగురు మహిళా బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు.

Updated Date - May 05 , 2024 | 03:16 AM