ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ఆరా
ABN , Publish Date - May 05 , 2024 | 01:09 AM
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు.
- కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ముకేశ్కుమార్ మీనా
అనకాపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్తో పాటు కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంసీఎంసీ రూమ్లో న్యూస్ వాచింగ్, ఫిర్యాదుల విభాగంలో ఏర్పాట్లు, ప్రకటనలు, సర్టిఫికెట్ల మంజూరు, వివిధ టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న స్ర్కోలింగ్స్, చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి, జేసీ జాహ్నవి జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, సన్నద్ధత వివరాలను తెలియజేశారు.