tdp: కూటమితోనే ప్రజాసంక్షేమం: పల్లె సింధూర
ABN , Publish Date - May 05 , 2024 | 01:05 AM
పుట్టపర్తి మే 4: ప్రజాసంక్షేమం కూటమి తోనే సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి పరిధిలోని ప్రశాంతిగ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. సత్యసాయి నడయాడిన ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అరాచక పాలన సాగించారన్నారు.
పుట్టపర్తి మే 4: ప్రజాసంక్షేమం కూటమి తోనే సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి పరిధిలోని ప్రశాంతిగ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. సత్యసాయి నడయాడిన ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అరాచక పాలన సాగించారన్నారు.
ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్య మన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కొత్తచెరువు మండలం మామిళ్లపల్లికుంటక్రాస్, గుంటిపల్లి, గోరంట్లపల్లి గ్రామాల్లో పల్లె సింధూర కూటమి శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. చంద్రబాబు సీఎం అవగానే అమలు చేస్తారన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనికోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....