Share News

bjp: వైసీపీకి బుద్ధి చెప్పండి: సత్యకుమార్‌

ABN , Publish Date - May 05 , 2024 | 01:16 AM

ధర్మవరం, మే 4: రాష్ట్రంలో ఆధ్యంతం అవినీతి పాలన సాగించిన వైసీపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాంనగర్‌, గుట్టకిందపల్లి, తారకరామాపురం, సాయినగర్‌, యాదవవీధి,. పార్థసారధినగర్‌ ప్రాంతాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

bjp: వైసీపీకి బుద్ధి చెప్పండి: సత్యకుమార్‌

ధర్మవరం, మే 4: రాష్ట్రంలో ఆధ్యంతం అవినీతి పాలన సాగించిన వైసీపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాంనగర్‌, గుట్టకిందపల్లి, తారకరామాపురం, సాయినగర్‌, యాదవవీధి,. పార్థసారధినగర్‌ ప్రాంతాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటా తిరిగి ఎమ్మెల్యేకు కమలం గు ర్తుకు ఓటేయాలని, ఎంపీకి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ అమలవుతాయని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో సీఎం జగన అవలంభించిన ప్ర జా వ్యతిరేక పాలన వల్ల రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. దీం తో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకే కూటమి ఏర్పాటైందని తెలిపారు. ఎన్నికల్లో ఆ అవినీతి పాలనకు బుద్ధి చెప్పాలని, కూటమిని గెలిపించాలని కోరారు. ఇక ని యోజవర్గంలో భూకబ్జాలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న కేతిరెడ్డిని కూడా ఇంటికి పంపించాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 05 , 2024 | 01:16 AM