tdp joining: టీడీపీలోకి 65 కుటుంబాలు చేరిక
ABN , Publish Date - May 05 , 2024 | 01:10 AM
ధర్మవరం రూరల్, మే4: మండలంలోని ధర్మపురి, నాగలూరు గ్రామాలకు చెందిన 65 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఽఅనంతపురంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో శనివారం వారు పరిటాల శ్రీరామ్ను కలిసి ఆయన సమక్షంలో చేరారు. వారికి శ్రీరామ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ధర్మవరం రూరల్, మే4: మండలంలోని ధర్మపురి, నాగలూరు గ్రామాలకు చెందిన 65 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఽఅనంతపురంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో శనివారం వారు పరిటాల శ్రీరామ్ను కలిసి ఆయన సమక్షంలో చేరారు. వారికి శ్రీరామ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
చేరిన వారిలో విష్ణు, పరమేష్, అప్పస్వామి, ఈశ్వరయ్య, ఆంజనేయులు, రవి, రామచంద్ర, రాము, లక్ష్మీదేవి, విశాక్, ఆంజనేయులు, అభితదితరులు ఉన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్యాదవ్ను, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడితే భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహే్షచౌదరి, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజినేయులు, తెలుగుయువత విజయ్చౌదరి, భాస్కర్చౌదరి, చంద్రశేఖర్, గోవిందు, రాజు, గొట్లూరు రహీమ్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....