Home » Telangana » Adilabad
రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత వేసవికాలంలో ఖాళీగా ఉన్న పంట భూములను సారవంతం చేసేందుకు రైతులు దృష్టిసారించారు. రైతులు తమచేన్లల్లో పొల్లాల్లో ఎరువులు వేసి సారవంతానికి చర్యలు చేపడుతున్నారు.
ఆసిఫాబాద్ రూరల్, మే 16: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్చౌక్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్ర మాలు నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.
ఆసిఫాబాద్, మే 16: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోగా అమ్మఆదర్శ పాఠశాలలకమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
వాంకిడి, మే 16: డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి ఉత్త రేణి సూచించారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది తో ర్యాలీ నిర్వహించారు.
సిర్పూర్(టి), మే 16: మండల కేంద్రంలో గురువారం భారీవర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు నిలు వడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. జూన్ 4న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకు లతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగి సిన అనంతరం ధాన్యానికి క్వింటాళుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా మనడం రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు.
ఆర్ఎంపీ, పీఎంపీల చికిత్స కేంద్రాలపై స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తూ వేధింపులకు గురి చేయడం సరైంది కాదని తెలంగాణ అనుభవ వైద్యుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్శి రవీందర్లు పేర్కొన్నారు.
జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డెంగ్యూ నివారణ మా బాధ్యత- సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యా ప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి ఆర్డీవో రాములు, డీఆర్డీవో కిషన్, జిల్లా పౌరసరపరాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.