Home » Andhra Pradesh » Visakhapatnam
ఈ ఎన్నికల్లో చాలా స్పష్టమైన మార్పు ఒకటి కనిపించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రైతుబజార్లు ఉన్నతాధికారులకు ఆదాయ వనరులుగా మారిపోయాయి.
రాష్ట్రంలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సంస్థను కేంద్రం తప్పించింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
పలు రైళ్ల రద్దుతో ప్రయాణికులు గురువారం అవస్థలు పడ్డారు. అనకాపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సుమారు నెలన్నర రోజులుగా కొనసాగిన ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. ఇదే క్రమంలో జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో రెండవ దశ నిర్మాణ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని స్థానిక జెన్కో అధికారులను ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రాల(హైడల్) డైరెక్టర్ ఎంవీవీ సత్యనారాయణ ఆదేశించారు. గురువారం సీలేరు కాంప్లెక్సులో పర్యటించిన ఆయన రూ.530 కోట్ల వ్యయంతో జరుగుతున్న పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలోని రెండవ దశ 5, 6 యూనిట్ల పనులను స్థానిక జెన్కో అధికారులతో కలసి పరిశీలించారు. తొలుత 5, 6 యూనిట్లకు నీటిని సరఫరా చేసే పెన్స్టాక్ పైప్లైన్ ఎరక్షన్ పనులను పరిశీలించారు.
మండలంలో అక్రమార్కులకు అడ్డే లేకుండాపోయింది. ప్రభుత్వ భూములు, గెడ్డ వాగులను కూడా దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధి వెదుళ్లనరవలో గెడ్డ వాగులను కప్పేసి చదును చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ర్టాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయ సునీత గురువారం తనిఖీ చేశారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్ రూమ్లను ఆయా రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన వశిష్ఠలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం సక్రమంగా పని చేసేలా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.
జిల్లాలో చేయూత పథకం నగదు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్ బటన్ నొక్కి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. వారంతా ఆ డబ్బులు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా బ్యాంకులకు వెళ్లి ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? అని ఆరా తీసిన అనేక మంది మహిళలకు నిరాశే ఎదురైంది. ఎన్నికల ముందు ఖాతాల్లో డబ్బులు వేస్తామని హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.