Home » Andhra Pradesh » Nellore
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ సాగాయి. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తించారు. టీడీపీ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లు ఇలా రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడ్డారు అధికారపార్టీ నేతలు. పోలింగ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్ఆర్కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే...
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ఏపీలో ఎన్నికల సమయం వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని, 2019లో కోడికత్తి , ఇప్పుడు గులకరాయి ... రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు.
Andhrapradesh: ‘‘ఆఫ్ టిక్కెట్ జగన్ నెల్లూరుకి వచ్చి అయిదేళ్లు అయింది. ముద్దులు పెట్టావు... మళ్ళీ ఈ రోజు నెల్లూరు వచ్చావు’’ అంటూ సీఎం జగన్పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ నకళ్లని ఆనం దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరుడు అవినీతి వద్దని చెప్పడం హాస్యాస్పదమని...‘‘మీ కుటుంబం అవినీతి కుటుంబం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు: పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నెల్లూరు: బలవంతంగా రూ. వంద ఇస్తాం.. రెండు వందలు ఇస్తామని చెప్పి వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిముషాలు కూడా ఉండడంలేదు. అసలే ఎండాకాలం... వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం.. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు.