Home » Andhra Pradesh » Krishna
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల్లో అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో నిరాశ, నిస్పృహలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేత లపై వైసీపీ నేతలు దాడులకు దిగారని, ఇది దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థుల కోసం ఆత్కూరు, తేల ప్రోలు, ఉంగుటూరు, మానికొండ శాఖా గ్రంథాలయాల్లో ఈనెల16 నుంచి జూన్ 7వరకు వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయా గ్రంథాలయాధికారులు బీవీ కృష్ణారావు, బి.శ్రీనివాసరావు, యు. చంద్రశేఖరరావు, ఎల్.హరికృష్ణ తెలి పారు.
తాడిగడప మునిసిపాలిటీలోని క్లస్టర్లు తాడిగడప, పోరంకి, కానూరు, యనమలకుదురులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. చెత్తను తొలిగించి బ్లీచింగ్ చల్లించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నారు.
దేవదాయ శాఖ ఆధీనంలోని వీరవల్లి, చిరివాడ గ్రామాల్లోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేదాద్రిలో వేంచేసియున్న యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ పత్రిక, వాల్పోస్టర్ను గురువారం ఈవో హేమలతా దేవి, వంశపారంపర్య ధర్మకర్తల తరపున రాంప్రసాద్ ఆవిష్కరించారు.
పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి నాలుగు ఇళ్లలో వరుస చోరీలతో బంగారం, వెండి, నగదును అపహరించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారికి గడిచిన 16 రోజులకుగాను రూ.2,09,49,116లు కానుకల రూపేణా సమకూరింది. గురువారం ఆలయ మహామండపంలోని ఆరో అంతస్తులో ఈవో కేఎస్ రామారావు, అధికారులు, రక్షకభటులు, ప్రత్యేక పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపును నిర్వహించారు.
ప్రయాణికుల వెయిట్ లిస్ట్లను క్లియర్ చేసేందుకు పలు రైళ్లకు అదనపు కోచ్లను అనుసంధానం చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.