Home » Andhra Pradesh » East Godavari
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జరిగిన పోలింగ్ మండలంలోని ఆయా గ్రామాల్లో అధికశాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల నిర్దేశిత సమయం దాటి పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా 2019లో జరిగిన ఎన్నికల్లో 82.7శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి 86శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని బూత్లలో 90శాతం మించి ఓటింగ్ జరిగింది.
ఆదికవి నన్నయ వర్శిటీలోని స్ర్టాంగ్ రూమ్ వద్ద 24/7 మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత తెలిపారు.
జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది.. రూ.100, 200,500 నోట్లు నకిలీ మకిలీ అంటించుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద ఏ నోటు ఇచ్చినా అయ్యబాబోయ్ అంటున్నారు..
ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.. ఒకరు జిల్లాకు అధికారి అయితే.. మరొకరు రాజమహేంద్రవరం కార్పొరేషన్కు అధికారి.. అయినా అక్రమార్కులకు అడ్డే లేదు.. అనుకున్న రీతిన.. నిబంధనలకు వ్యతిరేకంగా కట్టేస్తున్నారు..
జిల్లాలో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగు తు న్నాయి. జిల్లా అధికారులంతా ఉండే రాజమహేంద్రవరంలోనూ ఇదే పరి స్థితి. కడియం మండలం బుర్రిలంక ఇసుక ర్యాంపులో బుధవారం రాత్రి ఇసుక తవ్వకాలు జరిపారు.పెరవలి మండలం తీపర్రు ఇసుక ర్యాంప్ వద్ద ఇదే పరిస్థితి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆస రా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు బటన్ నొక్కారు. అయితే నేటి వరకు ఒక్క ఆసరా సొమ్ములతోనే సరి పెట్టి మిగిలిన ఈబీసీనేస్తం, చేయూత పథకాలకు ప్రభు త్వం మెండిచేయి చూప డంతో లబ్ధిదారులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నా రు.
రాజకీయాలు పూర్తిగా వ్యాపారం అయ్యాయి. ఎన్ని కలు మరీ ఖరీదయ్యాయి. ప్రజాస్వామ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు. ఓ మోస్తరు కోటీశ్వరులు ఎన్నికలను ఎదుర్కోలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చే సమయంలో కూడా అభ్యర్థి ఆర్థిక పరిస్థి తిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలో 82.29 శాతం పోలింగ్ నమో దైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించగా మండలాల వారీగా పోలింగ్ సమాచారం గురువారం వెల్లడించారు.
పిఠాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి మూడురోజులు గడుస్తున్నా లెక్కలుమాత్రం తెగడం లేదు.
ఎన్నికల నేపథ్యంలో వల్లూరులో జరిగిన ఘర్షణపై అంగర పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయని అంగర ఎస్ఐ పరదేశి గురువారం తెలిపారు.