Home » Andhra Pradesh » Chittoor
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలై చాలా రోజులైనప్పటికీ ఎన్నికల కారణంగా కొండపై రద్దీ తక్కువగానే కనిపించింది.
ఓ కారు దగ్ధమైన సంఘటన తిరుపతి గరుడ సర్కిల్లో జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లెకి చెందిన ఎం.శ్రీనివాస రెడ్డి కుటుంబీకులతో తిరుమలకు వెళ్లారు.
ఓటమి భయంతోనే కూటమి నాయకులపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
దీపాలు చెరువులో వదులుతుండగా ప్రమాదవశాత్తూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతలను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం విఫలం కావడంతో అంతా ఊహించినట్టుగానే జరిగిపోయింది. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషన్.. తిరుపతి డీఎస్పీ సురేంద్రరెడ్డి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ భాస్కర్రెడ్డి, స్పెషల్ బ్రాంచి సీఐ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిని సస్పెండు చేసింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు.
మండలంలోని బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో గురువారం ఉదయం రెండు ఈచర్లు ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
అకాల వర్షంతో మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు నష్టపోయారు. జిల్లాల విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో మామిడి సాగు ప్రధాన పంటగా మారింది.
ఇప్పటి పరిస్థితుల్లో ఏ చిన్న పని చేసేందుకు వెళ్లినా పనిని బట్టి రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు కూలి ఇస్తున్నారు. కానీ, జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు మాత్రం దారుణంగా ఐదు రోజులకు రూ.1900 చొప్పున ఇచ్చారు.