Home » Andhra Pradesh » Ananthapuram
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...
రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు కల్వర్ట తెగిపోవడంతో రాకపోకలు సాగించేందుకు గ్రామీణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని మణూరు- కల్లుమర్రి, సీ కోడిగేపల్లికి వేళ్లే ప్రధాన రహదారిలోని కల్వర్టు రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు కుప్ప కూలి పోయింది. అప్పటి నుంచి దాని మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రజలు వ్యవ సాయ పొలాల గుండా రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో వర్షాకాలం ప్రారం భంకానుంది.
సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓలు, ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి
వర్షం కురిస్తే చాలు మండలంలోని మట్టి రోడ్లు బురద మయం అవుతున్నాయి. మండలంలోని జమ్ములబండ నుంచి రామాయనహట్టి మీదుగా మేకులగడ్డ వరకు సుమారు 10కి.మీ. మట్టి రోడ్డు ఉంది. అలాగే కొంక ల్లు గేటు నుంచి కొంకల్లు గ్రామానికి సుమారు కిలో మీటరు, ఆదిబైరేశ్వరస్వామి దేవాలయం నుంచి సీసీగిరి గ్రామానికి వెళ్లే కిలోమీటరు మట్టి రోడ్డు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు, వాహన దారులు వాపోతున్నారు.
అరవైఏళ్లు పైబడిన టీబీ వ్యాధిగ్రస్థులు త ప్పనిసరిగా బీసీ జీ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని డీఎంహెచఓ మంజువాణి సూచిం చారు. ఆమె గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేసి బీజీజీ టీకాపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇదివర కే టీబీ సోకిన చక్కెర వ్యాధి గ్రస్థులు, ధూమపానం చేయువారు, బాడి మాస్ ఇండెక్స్ 18కన్నా తక్కువ ఉన్నవారు టీకా తీసుకోవచ్చన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మహిళా ఓటర్లేనని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత స్థానిక నాయకులతో పేర్కొన్నారు. ఆమె గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయా మండలాల్లో జరిగిన ఓటింగ్ సరళిపై చర్చించారు.
మండలపరిధిలోని కంబాలపల్లిలో గ్రామ సచివాలయ ని ర్మా ణ పనులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే... రాష్ట్రంలో గాంధీజీ కల లుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపించడానికి కృషిచేస్తున్నామంటూ ప్రతి పంచాయతీ కి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్క్లినిక్లను మంజూరు చేసిం ది. మండలపరిధిలో 15గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. పక్కా భవనా లను మంజూరు చేసి నిర్మించింది. వాటిలో మిగిలిన వన్నీ పూర్తయినా కంబాల పలి లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణ పనులు అర్ధం తరంగా ఆగిపోయాయి.
మండలకేంద్రంలోని సచివాలయం ఉద్యోగులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. సమయపాలన పాటించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
కరువు రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల పోలింగ్ ముగిసి నాలుగు రోజులు కావస్తున్నా... జిల్లాకు విత్తన కేటాయింపు... సబ్సిడీ ధరల ఖరారుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విస్మయం కలిగిస్తోంది.