Share News

ఐదున రాహుల్‌ గాంధీ రాక

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:35 PM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన ఎర్రవల్లి మండల కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తెలిపారు.

ఐదున రాహుల్‌ గాంధీ రాక
ఎర్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌

ఎర్రవల్లి, ఏప్రిల్‌ 30: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన ఎర్రవల్లి మండల కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఎర్రవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లడారు. రాహుల్‌ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దురదృష్టవశాత్తు తాను ఓటమి పాలైనా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. అంతకు ముందు బహిరంగ సభా స్థలాన్ని పరీశీలించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎర్రవల్లి మాజీ సర్పంచ్‌ జోగుల రవి, మండల అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, నాయకులు లక్ష్మీనారయణరెడ్డి, సోమనాద్రి, నీలి శ్రీను, మాణిక్యరెడ్డి, మెడికల్‌ మద్దిలేటి, నరసింహ, వెంకటేష్‌, బజారన్న, శ్యామ్‌ సుందర్‌, మధునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:35 PM