నడిగడ్డ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 01 , 2024 | 11:22 PM
నడిగడ్డ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా, నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి
- ఎన్హెచ్పీఎస్ నాయకులతో సమావేశం
గద్వాల టౌన్, మే 1 : నడిగడ్డ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా, నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పోరాట సమితి (ఎన్హెచ్పీఎస్) కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా చైర్మన్ రంజిత్కుమార్, కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు రంగస్వామిలతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి చేస్తున్న కృషిని అభినందించారు. వారి పోరాటాలకు తోడ్పాటునందిస్తానన్నారు. ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి సాగిస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చి, అండగా నిలవాలని కోరారు.