కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి
ABN , Publish Date - May 01 , 2024 | 11:01 PM
అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పా ర్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు.
- బీఆర్ఎస్ అఽభ్యర్థి మన్నె శ్రీనివా్సరెడ్డి
దామరగిద్ద, మే 1 : అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పా ర్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ము ఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సమావేశంలో మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడు తూ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిం దన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి, పార్లమెంట్ ఎన్నికలో ఓ ట్లు అడగాలన్నారు. వచ్చే దసరా పండుగ లోపు ప్రభుత్వం పడిపో వడం ఖాయం అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల మూరు - రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తా మని చెప్పి ఓట్లు అడగాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రసాద్, మన్నె ప్రతా ప్రెడ్డి, రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, ఎంపీ పీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి పాల్గొన్నారు.