రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:34 PM
మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిని దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఎస్ఐ కే.రవి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మండల కేంద్రానికి చెందిన వనపర్తి గోపాల్(65) ముఖ్య కూడలిలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల నుంచి హైదారాబాద్కు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
రాజాపూర్, ఏప్రిల్ 30: మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిని దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఎస్ఐ కే.రవి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మండల కేంద్రానికి చెందిన వనపర్తి గోపాల్(65) ముఖ్య కూడలిలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల నుంచి హైదారాబాద్కు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దాంతో తలకు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. గోపాల్ కుమారుడు సురేందర్ కారు డ్రైవరుపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.