Kumaram Bhim Asifabad: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే పాల్వాయి
ABN , Publish Date - May 01 , 2024 | 10:45 PM
బెజ్జూరు, మే 1: బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని రెబ్బెన గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడెం నగేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు
బెజ్జూరు, మే 1: బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని రెబ్బెన గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడెం నగేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రధానిమోదీ ఆధ్వర్యంలో అభివృద్ధికి పాటుపడుతామన్నారు. ఎంపీగానగేష్ను గెలిపించినట్ల యితే ఇద్దరం కలిసి జోడెద్దుల్లాగా పని చేసి సిర్పూర్ అభివృద్ధికి పాటుపడు తామన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి 100కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎంపీఅభ్యర్థి నగేష్ మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించినట్లయితే నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడుతానన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, వీరభద్రా చారి, మనోహర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లి రైల్వేఓవర్బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లి రైల్వేఓవర్ బ్రిడ్జిపనులను బుధ వారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, బీజేపీ జిల్లాఅధ్యక్షుడు కొత్తపల్లి శ్రీని వాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం టోంకిని సిద్ధిహనుమాన్ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.