Share News

Kumaram Bheem Asifabad: సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 01 , 2024 | 10:52 PM

ఆసిఫాబాద్‌, మే 1: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. పార్లమెంట్‌ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పా టుచేసిన జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొనను న్నారు.

Kumaram Bheem Asifabad:   సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

- నేడు ఆసిఫాబాద్‌లో జనజాతర బహిరంగ సభ

- హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

- భారీగా జనసమీకరణకు సన్నాహాలు

ఆసిఫాబాద్‌, మే 1: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. పార్లమెంట్‌ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పా టుచేసిన జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొనను న్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా సీఎం జిల్లాకు చేరుకోనున్నా రు. ఆసిఫాబాద్‌పట్టణంలోని ప్రేమలగార్డెన్‌సమీపంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. జనజాతర బహిరంగసభలో పాల్గొని కాంగ్రెస్‌పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రంసుగుణక్క తరపున ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

భారీగా జనసమీకరణ..: ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధిలో సీఎం సభకు 25వేలమందిని తరలించేందుకు పార్టీనాయకులు ఏర్పాట్లు చేస్తు న్నారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లాఅధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్‌ నేతృత్వంలో భారీగా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు

ఏర్పాట్లు పూర్తి..: ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకోసం ప్రత్యేక షామి యానాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌, సభాస్థలి పనులను మంత్రి సీతక్క, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్‌, జిల్లాలోని ఆసి ఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఎస్పీ సురేష్‌కుమార్‌ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొననున్నారు.

Updated Date - May 01 , 2024 | 10:52 PM