మెప్మా యానిమేటర్లతో వైసీపీ సమావేశం
ABN , Publish Date - May 02 , 2024 | 06:16 AM
సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో బుధవారం వైసీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కళాశాలలో మెప్మా యానిమేటర్లతో వైసీపీ నాయకు లు రహస్య సమావేశం నిర్వహించారు.
అడ్డుకున్న కూటమి నాయకులు.. వాగ్వాదం
బద్వేలు, మే 1: సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో బుధవారం వైసీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కళాశాలలో మెప్మా యానిమేటర్లతో వైసీపీ నాయకు లు రహస్య సమావేశం నిర్వహించారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధ, కుడా చైర్మన్ గురుమోహన్, బద్వేలు మున్సిపల్ వైస్చైర్మన్ సాయిక్రిష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులందరూ వైసీపీకి ఓట్లు వేసేలా కృషిచేయాలని,
తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నివిధాలా లబ్ధి చేకూరుస్తామని, ప్రస్తుతానికి నగదు లేదా వస్తు రూపంలో బహుమతులు అందజేస్తామని వైసీపీ నాయకులు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశం విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు.
దీంతో కూటమి, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో యానిమేటర్లు ముఖాలకు ముసుగులు వేసుకుని పారిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాల వారికి సర్ది చెప్పారు.