Share News

గుండెపోటుతో జడ్పీ ఏవో మృతి

ABN , Publish Date - May 02 , 2024 | 12:41 AM

నిజాయితీగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ హెచ్‌ సెక్షన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి (ఏవో)గా పనిచేస్తున్న కంజులూరి నరసింహమూర్తి (56) మంగళ వారం రాత్రి గుండెపోటుతో నిడదవోలులో మృతి చెందారు.

గుండెపోటుతో జడ్పీ ఏవో మృతి
నిడదవోలులో మూర్తి పార్ధివదేహాన్ని మోస్తున్న జడ్పీ మాజీ చైర్మన్‌ బాపిరాజు

ఏలూరుసిటీ, మే 1:నిజాయితీగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ హెచ్‌ సెక్షన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి (ఏవో)గా పనిచేస్తున్న కంజులూరి నరసింహమూర్తి (56) మంగళ వారం రాత్రి గుండెపోటుతో నిడదవోలులో మృతి చెందారు. జడ్పీ ఉద్యోగులు నిడదవోలు వెళ్లి మూర్తి పార్ధివ దేహానికి నివాళులర్పించారు. జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజుకు మూర్తితో ఉన్న అనుబంధంతో అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. నరసింహమూర్తికి భార్య, కుమారుడు ఉన్నారు. నరసింహమూర్తి 1994లో జూనియర్‌ అసిస్టెంట్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. కొవ్వూరు మండల పరిషత్‌ కార్యాలయంలో కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్‌కు సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతిపై వచ్చారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజుకు మూర్తి సీసీగా పనిచేశారు. అనంతరం 2019లో విజ యవాడ ఏపీఎస్‌ ఐఆర్‌డీలో పనిచేసి తిరిగి పదోన్నతిపై జిల్లా ప్రజా పరిషత్‌కు అడ్మిని స్ట్రేటివ్‌ అధికారిగా వచ్చారు.ఆయన మృతికి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ ప్రసాద్‌, జడ్పీ సీఈవో సుబ్బారావు, డిప్యూటీ సీఈవో నిర్మలా జ్యోతి, అక్కౌంట్స్‌ అధికారి ప్రకాష్‌, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రాజు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు గోవింద రాజులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - May 02 , 2024 | 12:41 AM