Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - May 02 , 2024 | 12:10 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రాజాం రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేగిడి మండలం పోరాం గ్రామానికి చెందిన కోరుకొండ రాము(49) గత నెల 28న రాజాం నుంచి పాలకొండ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ రాజాం మండలం గురువాం గ్రామ సమీపంలో ఒక్కసారిగా ఆగడంతో ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాము తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు రాజాంలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ వివరించారు. మృతుడి భార్య మగతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 12:10 AM