నేడు పాలకొండకు పవన్..
ABN , Publish Date - May 01 , 2024 | 11:41 PM
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
పాలకొండ: జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నేరుగా ఆయన విశాఖ నుంచి పాలకొండకు రానున్నారు. గజాల ఖానా సమీపంలో హెలీప్యాడ్ వద్ద దిగి ప్రధాన రహదారి మీదుగా వడమ కూడలి వరకు ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా పవన్ పర్యటన విజయవంతం కోసం కూటమి నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.
హెలీప్యాడ్ను పరిశీలించిన ఏఎస్పీ
పవన్కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పాలకొండ-వీరఘట్టం రోడ్డులోని గజాల ఖానా సమీపంలో హెలీప్యాడ్ను బుధవారం ఏఎస్పీ దిలీప్కిరణ్ పరిశీలించారు. వడమ సెంటర్లో బహిరంగ సభ ప్రదేశాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. ఆయన వెంట డీఎస్పీ జీవీ కృష్ణారావు, ట్రైనీ డీఎస్పీ అజీజ్, సీఐ చంద్రమౌళి తదితరులు ఉన్నారు.