Share News

పవన్‌ పర్యటనను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 02 , 2024 | 12:06 AM

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గురువారం చేపట్ట నున్న పాలకొండ పర్యటనను విజయవంతం చేయాలని కూట మి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, జనసేన పరిశీల కులు వంపూరు గంగులయ్య, పాలవలస యశస్వి కోరారు.

పవన్‌ పర్యటనను విజయవంతం చేయాలి

పాలకొండ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గురువారం చేపట్ట నున్న పాలకొండ పర్యటనను విజయవంతం చేయాలని కూట మి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, జనసేన పరిశీల కులు వంపూరు గంగులయ్య, పాలవలస యశస్వి కోరారు. ఈమేరకు హెలీప్యాడ్‌ స్థలాన్ని, పట్టణంలోని స్టేట్‌బ్యాంకు దరిలో జరగనున్న సభా ప్రాంగణాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పవన్‌ పర్యటనను కూటమి నాయకు లు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు, జనసే న పరిశీలకులు కొరికాన రవికుమార్‌, టీడీపీ నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, గంటా సంతోష్‌ కుమార్‌, ఉదయాన ఉదయ్‌భాస్కర్‌, సుంకరి అనీల్‌దత్‌, అంపోలు శ్రీనివాసరావు, గార శ్రీధర్‌ పాల్గొన్నారు. జనసేన విజయానికి ప్రజలు సహకరించాలని ప్రముఖ వైద్యుడు, జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణ కోరారు. పట్టణంలోని జనసేన కార్యాలయంలో వారు బుధవారం విలేకర్లతో మాట్లాడారు. శ్రీధర్‌ మాట్లాడుతూ కూటమి మ్యానిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. జయకృష్ణ మాట్లాడుతూ తనకు సైకిల్‌పై గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.

నియోజకవర్గంలో జనసేన గెలుపే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని జనసేన నియోజకవర్గ పరిశీలకుడు కొరికాన రవికుమార్‌ పిలుపునిచ్చారు. పాలకొండలో బుధవారం నిర్వహించిన కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలవలస లీలాప్రసాద్‌, వావిలపల్లి రాజారావు, జాడ శ్రీధర్‌ పాల్గొన్నారు.

వీరఘట్టం: కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కోరుతూ మేజర్‌ పంచా యతీ పరిధిలో కూటమి నాయకులు బుధవారం ప్రచారం చేశారు.

పాలకొండ మండల కేంద్రంలో గురువారం జరగబోవు పవన్‌కళ్యాణ్‌ ర్యాలీని, బహిరంగ సభను మండలంలోని కూటమి కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్‌ కోరారు.

Updated Date - May 02 , 2024 | 12:06 AM