Share News

జిల్లాలో మండుతున్న ఎండలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:08 AM

జిల్లాలో ఎండలు మండుతున్నాయి.

   జిల్లాలో మండుతున్న ఎండలు

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పార్వతీ పురంతో పాటు మిగిలిన 15 మండలాల్లో, సాలూరు పురపాలక సంఘం, పాలకొండ నగర పంచాయతీలో ప్రజలు బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అదేవిధంగా సాలూరు, పాలకొండ ప్రాంతాల్లో సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. భవన నిర్మాణ కార్మికు లతో పాటు ఇతర కార్మికులు ఎండల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Updated Date - May 02 , 2024 | 12:08 AM