టీడీపీలో జోరుగా చేరికలు
ABN , Publish Date - May 02 , 2024 | 12:29 AM
టీడీపీతోనే గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు పడతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.
గిద్దలూరు టౌన్, మే 1 : టీడీపీతోనే గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు పడతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాల యంలో అర్థవీడు మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శ్రీపతి పుల్లయ్య ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాగే పాపినేనిపల్లె సర్పంచ్ పుల్లారావు ఆధ్వర్యంలో మండ్ల శ్రీనివాసులు, బోగం నడిపిరాజు, కేసనబోయిన నరసింహ, శ్రీనులు ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరారు.
సోదరుడి గెలుపు కోసం..
టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి సోదరి గీత బుధవారం రాచర్ల మండలం యడవల్లి పంచాయతీలోని యడవల్లి, చెర్లోపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గీత మాట్లాడుతూ నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలు టీడీపీతోనే తీరుతాయ న్నారు. ఆ దిశగా ముత్తుముల అశోక్రెడ్డి అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్రెడ్డికి, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి
గిద్దలూరు టౌన్ : ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మాజీ సైనికుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఈ ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యా లయం ఏర్పాటుకు కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి ముత్తు ముల అశోక్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని చీతి రాల కళ్యాణ మండపం నందు నియోజకవర్గంలోని మాజీ సైనికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమా వేశంలో పాల్గొన్న ముత్తుముల అశోక్రెడ్డి మాట్లా డుతూ దేశరక్షణలో ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైనికులు ఉండడం మన ప్రాంతానికి గర్వ కారణమన్నారు. ఈహెచ్ఎస్ వైద్యశాలకు, మిలటరీ క్యాంటీన్కు ప్రభుత్వ స్థలం మంజూరు చేస్తా మన్నారు. ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థిగా తాను, పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. సైనిక కుటుంబాలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధిం చారు. సమావేశంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ ఎస్.వేణుగోపాల్, సభ్యులు కోటారెడ్డి, నరసింహులు, లక్ష్మణ్బాబు, యోగేశ్వరరావవు, ఎఆర్కెరెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మీరంగయ్య, చెన్నయ్య, పాల్గొన్నారు.
కొమరోలు : స్థానికుడైన గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డిని ఆదరించాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని ఇడమకల్లు పంచాయతీలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత టీడీపీ హయాంలో ఎమ్మెల్యే ఉన్న అశోక్రెడ్డి చేసిన అభివృద్ధి పనులు గుర్తుచేశారు. మండల నాయకులు పాల్గొన్నారు.