సామాన్య కార్యకర్తకు ఒక్క అవకాశం ఇవ్వండి
ABN , Publish Date - May 02 , 2024 | 12:34 AM
ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి సామాన్య కార్యకర్తగా తాను పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు పేర్కొన్నారు.
పుల్లలచెరువు ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థి ఎరిక్షన్బాబు
పుల్లలచెరువు, మే 1: ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి సామాన్య కార్యకర్తగా తాను పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు పేర్కొన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే వైపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. బుధవారం పుల్లలచెరువు మండలం ఐటీవరం పంచాయతీ రెంటపల్లి, సిద్దెనపాలెం, సుద్దకురువతాండల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరుగలాంటే టీడీపీని ఆదరించాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి గడపలో సమస్య తెలిసిన వ్యక్తిని అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు 4వేల పింఛన్, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాసు సిలిండర్లు, నెలకు 18 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళకు 1500 ఆర్ధిక సహాయం వంటి సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, టీడీపీ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, కాకర్ల కోటయ్య, గజ్వేల్లి భాస్కర్, ఉప్పల హనుమంతు, కే.కుమార్, మేడికొండ లక్ష్మి నారాయణ, శనగా నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫాస్టర్లతో ఆత్మీయ సమావేశం
ఎర్రగొండపాలెం : పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవించిన ఘనత టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు దక్కుతుందని టీడీపీ కూటమి అభ్యర్ధి గూడూరి ఎరక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంతో బుధవారం జరిగిన నియోజకవర్గ పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే నియోజకవర్గంలలో క్రైస్తవ సంఘాల పాస్టర్లను గౌరవించి వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ప్రోత్సహిస్తామన్నారు. మే 13న జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మద్దతుగా నిలవాలని కోరారు. జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాస్టర్లకు భరో సా ఇచ్చి నమ్మకం కలిగించిన నాయకుడు టీడీపీ కూటమి అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్బాబు అని అన్నా రు. కార్యక్రమంలో టీడీపీ క్రిస్టి యన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సాధుసుందర్సింగ్, నాయకులు ఎంఐ ప్రసాదు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎల్.అబ్రహం, కిన్నెర దేవసహాయం, చేదూరి గంగయ్య, నవజీవన పాస్టర్ల నియోజకవర్గ అధ్యక్షులు మాకం జీవయ్య, చేదూరి లక్ష్మయ్య, ఐదు మండలాలనుంచి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రధాత చంద్రబాబునాయుడు
పెద్ద దోర్నాల : అభివృద్ధి ప్రధాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని గూడూరి ఎరిక్షన్బాబు కుమార్తె చెల్సియా అన్నారు. మండలంలోని ఐనముక్కుల గ్రామంలో చల్సియా, ఎరిక్షన్బాబు తనయుడు అజిత్లు బుధవారం ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిఎరిక్షన్బాబును, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని వారు అభ్యర్ధించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏర్వ మల్లికార్జున రెడ్డి, నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, షేక్ ఇస్మాయిల్, భాష, ఎలకపాటి చంచయ్య, బట్టు సుధాకర్ రెడ్డి, జంగిలి పిచ్చయ్య,కే సుబ్బారెడ్డి, షేక్ మంజూర్ భాష, బోళ్ల రమణారెడ్డి పాల్గొన్నారు.