‘హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి’
ABN , Publish Date - May 02 , 2024 | 12:35 AM
జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు, నిధుల కోసం దూదేకుల కులస్థులు ఐకమత్యంతో పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ బాబన్ పిలుపునిచ్చారు.
డోన్(రూరల్), మే 1: జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు, నిధుల కోసం దూదేకుల కులస్థులు ఐకమత్యంతో పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ బాబన్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి దూదేకుల ఆత్మీయ సమ్మేళనం క్వాలిటీ రెహిమాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కింద దూదేకులను పరిగణిస్తూ ప్రభుత్వం వారి హక్కు ల ను అలక్ష్యం చేస్తున్నదని అన్నారు. దూదేకులను గుర్తించే పార్టీలు, న్యాయం చేసే పార్టీలకు మద్దతు పలకాలని కోరారు. నాయకులు క్వాలిటీ అబ్దుల్లా, దస్తగిరి, జాకీర్, హుశేన్, అక్బర్ పాషా, కాశీం, ఖాజా, షేక్షావలి, ఇబ్రహీం, సిద్దిక్, మాబాషా, జహరుద్దీన్, మౌలాలి పాల్గొన్నారు.