తాగునీరు ఇవ్వలేని మంత్రికి బుద్ధి చెప్పండి: కోట్ల
ABN , Publish Date - May 02 , 2024 | 12:34 AM
డోన్ నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు ఇవ్వలేని మంత్రి బుగ్గనకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
డోన్, మే 1: డోన్ నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు ఇవ్వలేని మంత్రి బుగ్గనకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రేకులకుంట, దేవర బండ, మిద్దెపల్లి గ్రామాల్లో కోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేకులకుంట, దేవరబండ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బం దులు పడుతున్నామని ప్రజలు కోట్లకు మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా కోట్ల మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మంత్రి సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేరని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చలేని బుగ్గనకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, వలసల రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్, రేగటి అర్జున్ రెడ్డి, దేవరబండ వెంకటనారాయణ, టీఈ లక్ష్మీదేవి, దేవరబండ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, తాడూరు వెంకటరమణయ్య, మిద్దెపల్లి గోవిందు, గోవిందరెడ్డి, భూమానాగన్న, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్ పాల్గొన్నారు.