కలిసికట్టుగా పనిచేద్దాం: సుబ్బారెడ్డి
ABN , Publish Date - May 02 , 2024 | 12:32 AM
టీడీపీ కూటమి డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి కోరారు.
డోన్, మే 1: టీడీపీ కూటమి డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని సుబ్బారెడ్డి నివాసంలో యువ నాయకులు కోట్ల రాఘవేంద్రరెడ్డితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎంతో నమ్మకంతో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా తన కు బాధ్యతలు అప్పగించారన్నారు. గతంలో డోన్ టీడీపీ ఇన్చార్జి బాధ్య తలు ఇచ్చిన సమయంలో మూడేళ్లు అందరం కష్టపడి పార్టీని బలంగా తయారు చేశామన్నారు. కొన్ని కారణాలతో చంద్రబాబు డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని నిలిపారన్నారు. కోట్ల కుటుంబం నుంచే తాను రాజకీయంగా ఎదిగాననీ, ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కోట్ల రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ధర్మవరం సుబ్బారెడ్డి కోట్ల కుటుంబంలో సభ్యులేనని, ఆయనను నమ్ముకున్న వారందరికీ తాము అండగా ఉండి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈసమావేశంలో మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, మాజీ ఎంపీపీ ఆర్ఈ రాఘవేంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు, ప్రజావై ద్యశాల మల్లికార్జున, ధర్మవరం గౌతమ్ రెడ్డి విజయకుమార్ రెడ్డి, అభిరెడ్డి పల్లె గోవిందు, షేక్షావలి చౌదరి, కృష్ణప్రసాద్, సుదర్శన్, ఎల్ఐసీ శ్రీరాము లు, జయన్న యాదవ్, సర్పంచ్ రామిరెడ్డి పాల్గొన్నారు.