Share News

కురువలు చంద్రబాబును సీఎం చేయాలి

ABN , Publish Date - May 02 , 2024 | 12:27 AM

కురువలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కర్నూలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ పిలుపునిచ్చారు.

కురువలు చంద్రబాబును సీఎం చేయాలి

ఎంపీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా

టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

ఆదోని, మే 1: కురువలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కర్నూలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బీరప్పస్వామి దేవాలయ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన కురువ ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, అసెంబ్లీ అభ్యర్థి పార్థసారథితో కలిసి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కురువలను రాజకీయంగా గుర్తించి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీనే అన్నారు. 40 ఏళ్లుగా జిల్లాలో కురువలకు ఏ రాజకీయ పార్టీ ఎంపీ సీటు కానీ, ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కురువ కులానికి చెందిన తనకు ఎంపీ సీటు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో టీడీపీ ఎంపీపీగా పోటీ పడినప్పుడు కురువ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మహిళా ఎంపీటీసీ కులంపై ప్రేమతో తనకు ఓటు వేశారని, కురువల్లో ఉన్న ఐక్యతను చూసి, రెండెన్నర సంవత్సరాలు పోరాడి ఎంపీ టెక్కెట్‌ తెచ్చుకున్నానన్నారు. తాను గెలిచాక కురువల ఎస్సీ సర్టిఫికెట్ల కోసం పార్లమెంట్‌లో పోరాడతానని హామీ ఇచ్చారు. ఇది కురువలకు చివరి అవకాశమని, ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే కురువలకు రాజకీయ సమాధి పడినట్లేనని నాగరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేంద్రప్ప, చాగి మల్లికార్జున రెడ్డి, బత్తిన కుబేర్‌నాథ్‌, గుడిసె కృష్ణమ్మ, జనసేన ఆదోని ఇన్‌చార్జి మల్లప్ప, బత్తిన లక్ష్మీనారాయణ, నాగరాజు గౌడ్‌, భూపాల్‌ చౌదరి, బుద్ధారెడ్డి, బసవరాజు, నాగప్ప, బంగారు సుధాకర్‌, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:27 AM