అన్ని వర్గాలకు న్యాయం
ABN , Publish Date - May 02 , 2024 | 12:26 AM
కులాల ప్రాతిపదికన జిల్లాలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపి, అందరికీ న్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు
కర్నూలు(అర్బన్), మే 1: కులాల ప్రాతిపదికన జిల్లాలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపి, అందరికీ న్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు బీజేపీ నుంచి సూర్యప్రకాష్, ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ కోడుమూరు అసెంబ్లీ అభ్యర్ధి బొగ్గుల దస్తగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామక్రిష్ణ, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలతో జగన్, వైసీపీ నాయకులు భయంతో వణికిపోతున్నారన్నారు. మే 13 జరిగే పోలింగ్లో టీడీపీ, జనసేన, బీజేపీ, అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు రూపొం దించిన మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని తెలిపారు. బీపీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీ అర్ధికాభివృద్ధి, ఉపాఽధికి ప్రాధాన్యత ఉందని అన్నారు.