సరిహద్దు చెక్పోస్ట్ తనిఖీ
ABN , Publish Date - May 01 , 2024 | 11:55 PM
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టును బుధవారం నంద్యాల కలెక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
మహానంది, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టును బుధవారం నంద్యాల కలెక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసారు. మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని చెక్ పోస్టును కలెక్టర్ తనిఖీ చేసి వాహనాలను నమోదు చేసే రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యంతో పాటు ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే అధికారులకు గాని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో గాని వెంటనే సమాచారం అందించాలన్నారు. నిత్యం జాగ్రత్తగా ఉంటూ చెక్ పోస్టుల వద్ద సిబ్బంది విధులు నిర్వహించాలని తెలిపారు. వీరి వెంట మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.