Share News

పోలీసు స్టేషన్‌లో ఇంటి దొంగ

ABN , Publish Date - May 02 , 2024 | 12:24 AM

ఆదోని టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోమ్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కే మనోజ్‌ కుమార్‌ స్టేషన్‌ ప్రాపర్టీ రూమ్‌కు డూప్లికేట్‌ తాళాలు తయారు చేసుకుని వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన రూ.5.63 లక్షలు దొంగతనం చేసినట్లు గుర్తించారు.

పోలీసు స్టేషన్‌లో ఇంటి దొంగ

కేసుల్లో రికవరీ చేసిన సొమ్మును చోరీ చేసిన హోంగార్డు

ఎట్టకేలకు అరెస్టు

ఆదోని, మే 1: ఆదోని టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోమ్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కే మనోజ్‌ కుమార్‌ స్టేషన్‌ ప్రాపర్టీ రూమ్‌కు డూప్లికేట్‌ తాళాలు తయారు చేసుకుని వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన రూ.5.63 లక్షలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. చాలా రోజులుగా జరుగుతున్న ఈ తతంగం వివరాలను డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. అతను దొంగలించిన మొత్తంలో మూడు లక్షల నగదును స్వాధీనం చూసుకున్నట్టు తెలిపారు. మనోజ్‌కుమార్‌ కొంత మంది ఎస్‌ఐలకు డ్రైవర్‌గా ఉంటూ పలు స్టేషన్‌లో విధులు నిర్వహించారు. అక్కడ కూడా ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డుపై ఐపీసీ 454, 380 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ, ట్రైనీ డీఎస్సీ ధీరజ్‌ తెలిపారు. హోంగార్డును కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించరాని చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 12:24 AM