Share News

యువత ఆలోచించి..అభ్యర్థులను ఎన్నుకోండి

ABN , Publish Date - May 01 , 2024 | 11:56 PM

ఓటు హక్కు వచ్చిన ప్రతి యువత ప్రస్తుత ఎన్ని కల్లో ఎంపీ అభ్యర్థుల గుణాలు చూసి, ఆలోచించి ఓటు వేసి ఎన్ను కోవాలని పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

యువత ఆలోచించి..అభ్యర్థులను ఎన్నుకోండి
తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న కిరణ్‌ తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి

మదనపల్లె టౌన, మే 1: ఓటు హక్కు వచ్చిన ప్రతి యువత ప్రస్తుత ఎన్ని కల్లో ఎంపీ అభ్యర్థుల గుణాలు చూసి, ఆలోచించి ఓటు వేసి ఎన్ను కోవాలని పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రైవేటు ఫంక్షనహా ల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీ పీ, బీజేపీ, జనసేన యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిఖి లేష్‌ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్‌ బరిలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సౌమ్యుడు, నిజాయితీ పరుడన్నారు. కాని ప్రత్యర్థి బరిలో ఉన్న మిధునరెడ్డి సంస్కార హీనుడని, అవినీతి పరుడన్నారు. యువతకు మంచి భవిష్యత కావాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ టీడీపీ జాతీయప్రధాన కార్య దర్శి లోకేశ యువగళం పాదయాత్రలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారన్నా రు. సమావేశం నిర్వాహకులు మార్పురి వరుణ్‌, పెరవలి నవీన, నిరంజననాని, వంశీనరసింహ, రాటకొండ రాజేశ, క్రాంతి, నాదెళ్ల అరుణ్‌తేజ్‌ నిఖిలేష్‌కు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమం లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహానబాషా, రాటకొండ గురుప్రసాద్‌, మార్పురి సుధాకర్‌ నాయుడు, ఎస్‌ఏ మస్తాన, హరిహరన, జంగాల శివరామ్‌, ఆకుల కృష్ణమూర్తి, ఓసూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:56 PM