Share News

వైసీపీ నేతతో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:24 PM

బి.కొత్తకోట సింగిల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ కాపు నేత తిరుమల అమరనాథ్‌ తో కూటమి అభ్యర్థులు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు మం గళవారం భేటీ అయ్యారు.

వైసీపీ నేతతో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

అమరనాథ్‌ నివాసంలో అభ్యర్థులు కిరణ్‌కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డి

బి.కొత్తకోట, ఏప్రిల్‌30: బి.కొత్తకోట సింగిల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ కాపు నేత తిరుమల అమరనాథ్‌ తో కూటమి అభ్యర్థులు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు మం గళవారం భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మంగళ వారం బి.కొత్తకోటలో పర్యటించిన వారు స్థానిక నాయకుల సూచన మేరకు కొద్దిమంది అనుచరులతో అమరనాథ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సంద ర్బంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను ఆయన సాదరంగా ఆహ్వానిం చారు. కొద్దిసేపు వారితో రాజకీయ పరిస్థితి పై ముచ్చటించారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై అమనరాథ్‌ సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ కాపునాయకుడిగా, వైసీపీ నేతగా వున్న అమర్‌ కూటమి అభ్యర్థులతో ములాకత కావడం పట్టణంలో చర్చనీయాంశం అయింది.

Updated Date - Apr 30 , 2024 | 11:24 PM