Share News

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ABN , Publish Date - May 02 , 2024 | 01:03 AM

గండేపల్లి, మే 1: మండలంలో మల్లేపల్లి నీలికుండీలపేట కాలనీలో యువనాయకుడు పోతుల నాగసూర్య ఆధ్వర్యంలో బుధవారం సుమారు 35మందికిపైగా యువకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

గండేపల్లి, మే 1: మండలంలో మల్లేపల్లి నీలికుండీలపేట కాలనీలో యువనాయకుడు పోతుల నాగసూర్య ఆధ్వర్యంలో బుధవారం సుమారు 35మందికిపైగా యువకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగేక్లస్టర్‌ పరిధిలో ఉన్న మల్లేపల్లి, ఉప్పలపాడు, బొర్రంపాలెం, తాళ్ళూరు, సుబ్బయమ్మపేట, జడ్‌.రాగంపేట తదితర గ్రామాల్లో నవీన్‌ పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీ మండలాధ్యక్షుడు పోతుల మోహనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోర్పు సాయితేజ్‌, వల్లభశెట్టి కోటేశ్వరరావు, కుప్పాల మణికంఠ, దోసపాటి వెంకటలచ్చయ్య, ఆళ్ల శివ, కుప్పాల శ్రీను, తెలగరెడ్డి హరీష్‌, కొండబాబు, ఇంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 01:03 AM